సిహెచ్ కొండూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్

 

IMG 20231118 WA1109

నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో శనివారం రోజున పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వర్ మాట్లాడుతూ. ప్రతినెల మూడో శనివారం రోజున పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు నేటి బాలలే రేపటి నవ భారతి నిర్మాతలని అంటూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు తల్లిదండ్రుల పై ఆధారపడి తెలిపారు, విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధి కొరకు సూచనలు సలహాలు తెలుసుకొని ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు రాజేశ్వర్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మంజుల, ఉపాధ్యాయుల బృందం, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు,

*ఆర్మూర్ టౌన్ రిపోర్టర్*
*మెట్టు పోశెట్టి*

 

 

Leave a Comment