శ్రావణ సోమవారం సందర్భంగా నవనాథ సిద్ధుల గుట్టపై ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు…

నిజామాబాద్ A9 న్యూస్:

Picsart 23 08 21 22 35 44 267

ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు.బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేశ్వర్ రెడ్డి,మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

 

నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ భజన కార్యక్రమాలతో కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్దుల గుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, సిద్దుల గుట్ట పైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సేవాసమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Picsart 23 08 21 22 32 40 916

Leave a Comment