విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

నిజామాబాద్ A9 న్యూస్:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రాత్రి ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్న భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరామర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వాకబు చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని సూపరింటెండెంట్, డాక్టర్ ప్రతిమరాజ్ కు సూచించారు.

Leave a Comment