రాష్ట్రస్థాయి పోటీలకు సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్ A9 న్యూస్:

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో గల సెయింట్ ఆన్స్ స్కూల్ లో చదువుతున్న జక్కుల అద్రిజ, వేదాంష్ లు సోమవారం నిజామాబాదులో ఎస్ జి ఎఫ్ ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అండర్ 14 బాస్కెట్బాల్ కు రాష్ట్రస్థాయిలో ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ సుమలత మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు కిరణ్ మరియు కృష్ణ లు కోచ్ వంశీకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వ్యాయామ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

Leave a Comment