మెండోరా గ్రామం లోముగిసిన మల్లన్న ప్రతిష్టపాన వారోత్సవాలు

మెండోరా లో ఘనంగా మల్లన్న ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు

 చివరి రోజున భారీ అన్నదానo

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

సదాశివ్ బచ్చగొని A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం: 9059643232

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం మెండోరా         గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మల్లన్న ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. గత నాలుగు రోజులుగా మూల విగ్రహాల కు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన చేశారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇంటికి ఒకరు చొప్పున మల్లన్న మాల వేసుకుని భక్తులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

 నాల్గవ రోజు సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వెయ్యి మందికి పైగా భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం పెద్దమనుషులు భూమన్న, శ్రీనివాస్, మల్లన్న మాల స్వాములు, యాదవ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Comment