బడా భీమ్ గల్ నూతన గ్రామభివృద్ధి కమిటీ అధ్యక్షలు గా సాలింపురం బాలరాజ్

IMG 20240702 WA0510 1బడాభీంగల్ విడిసి అధ్యక్షుడిగా బాలరాజు, ఉపాధ్యక్షుడుగా దండు మహేష్.

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

జులై 02. *నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బడాభీంగల్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్ష ఎన్నికలలో రెండు పార్టీల అభ్యర్థులు పోటీలో నిలబడగా, కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి సాలిపురం బాలరాజును అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకే చెందిన దండు మహేష్ ను ఉపాధ్యక్షుడిగా 31 మంది గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ 11 సార్లు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడిగా సేవల అందించినందుకు నన్ను అధ్యక్షుడిగా గెలిపించిన బడా భీంగల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బడా భీంగల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి పరచుటకు కృషి చేస్తానని తెలిపారు. గెలుపొందిన బాల్ రాజ్, దండు మహేష్ లను బడాభీంగల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్ల శ్రీను, వడ్ల సురేష్ లు సన్మానించారు.

Leave a Comment