బడా భీమ్ గల్ గ్రామం లో మాజీ సీఎం కెసిఆర్ జన్మదిన సంబరాలు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బడా భీమ్గల్ గ్రామం లో   మాజీ ముఖ్యమంత్రివర్యులు కే. చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలు….

 

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తోలి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి 70వ జన్మదిన సందర్బంగా గ్రామ బి.ఆర్.యస్  కార్యాలయం లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

 

 

ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షులు రాగుల మోహన్ మాట్లాడుతూ 

పార్టీని నమ్ముకుని వెన్నంటే ఉండే కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. 

 

యువకులతో పార్టీకి పునర్జీవం తెస్తామని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా నిచ్చారు. 

 

గత 10సంవత్సరాల కాలంలో పార్టీ చేసిన అభివృద్ధికి ఆనవాళ్లు  

*నిత్యం మనం ప్రయాణం చేసే రోడ్స్* బ్రిడ్జి లు, ఆసరా పెన్షన్ లు, రైతు బీమా, రైతు బందు పథకాలతో ప్రజలకు తెలుసనీ అన్నారు.

 

 

 

 

 

*గ్రామ గ్రామనా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నగర అభివృద్ధి, వైకుంఠ ధామాలు*నిదర్శనం అని అన్నారు.

 

ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ప్రజలు మనలను తిరస్కరించలేదని ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాల వల్ల వేరే వారికీ అవకాశం ఇచ్చారని గుర్తు చేసారు. 

 

గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఉద్యమం ముందుండి కొట్లాడామని ఎప్పటికి కార్యకరలకు,ప్రశాంత్.   ఆ న్న  అందుబాటులో  ఉంటాడని అన్నారు. 

 

కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలని ఇచ్చి ప్రజలను మోసం చేసారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెపుతారని అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో , కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 

Leave a Comment