A9 న్యూస్ ప్రతినిధి:
ప్రజా వ్యతిరేక బిజెపి విధానాలను ఓడించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి సిపిఎం పిలుపు… సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశం సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గత పది సంవత్సరాలుగా బిజెపి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడానికి పార్టీ కార్యకర్తలు శ్రేణులు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి తన ఆధిపత్యాన్ని కొనసాగించటానికి స్వతంత్ర సంస్థలైన సిబిఐ,ఈడి, ఇన్కమ్ టాక్స్ తదితర సంస్థలను తన జేబు సంస్థలు గా మార్చుకొని ప్రత్యర్థి పార్టీల నాయకులను పందులు పెట్టటానికి దాడులు చేస్తూ అరెస్టులను చేసి లొంగ తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని అదేవిధంగా తన మాటను వినని వారిని జై లలో నిర్బంధించి అవినీతిపరుల చిత్రీకరిస్తూ బిజెపి నాయకులు మాత్రమే సచిలురనే ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఆయన విమర్శించారు దేశంలో నూటికి 90 శాతం గా ఉన్న ప్రజలకు గతి పది సంవత్సరాలుగా లబ్ధి చేకూర్చని నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టడం ద్వారా ఎలక్ట్టోరల్ బాండ్ల రూపంలో వారి నుండి డబ్బులను వసూలు చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నారని ఆయన విమర్శించారు ప్రజల్లో విద్వేషాలను పెంచి తిరిగి మూడోసారి అధికారంలోకి రావడానికి మత ఉద్రిక్తతలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటానికి ప్రజలందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పి వెంకటేష్, నూర్జహాన్, శంకర్ గౌడ్, గంగాధర్, శాల గంగాధర్ ఇతరులు పాల్గొన్నారు.