ప్రజా పాలన దరఖాస్తు జిరాక్స్ అక్రమంగా అమ్ముతున్న ఇద్దరిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్…!

కామారెడ్డి A9 న్యూస్:  

IMG 20231230 WA0036

సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం ప్రజా పాలన దరఖాస్తు జిరాక్స్ తీసుకువచ్చి భూంపల్లి గ్రామ ప్రజలకు డబ్బులు తీసుకొని జిరాక్స్ అక్రమంగా అమ్ముతున్న బండ భాస్కర్ మరియు అతనికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తి బురుపల్లి రమేష్ వీరిద్దరి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కానీ ఉన్నతాధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఇకనైనా స్పందించి అధికారులు, తగిన చర్యలు తీసుకోవాలని ఇకనైనా ప్రజాపాలన దరఖాస్తు జిరాక్స్ గ్రామంలో అమ్మకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ పాలకవర్గం ద్వారా ప్రజా పాలన దరఖాస్తు ఇస్తారని ప్రజలకు అవగాహన కల్పించాలని వారు పేర్కొన్నారు. జిరాక్స్ ఏదో, ఒరిజినల్ ఏదో తెలియకుండా ప్రజలు అయోమయంలో ఉన్నారని ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వ్యవహరించకుండా తగిన చర్యలు తీసుకోవాలి.

Leave a Comment