దోమకొండలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య*

A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి 

*దోమకొండలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య

దోమకొండ మండల కేంద్రానికి చెందిన వంశీ(24) అనే యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు దోమకొండ ఎస్సై గణేష్ తెలిపారు. గ్రామానికి చెందిన వంశీ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో నివాసం ఉంటూ దోమకొండకు వస్తూ పోతుంటాడని, ఇటీవల మద్యానికి అలవాటుపడ్డాడని, తనకు బైకు కొనియాలని తల్లిదండ్రులను అడగగా తర్వాత కొనిస్తామని చెప్పడంతో మనస్థాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.

IMG 20240403 124816

Leave a Comment