తిరుమల కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నికలు…..

నిజామాబాద్ A9 news:

ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నికలు ఆదివారం నిర్వహించడం జరిగింది.

 

 ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏడో వాడు కౌన్సిలర్, ఇట్టెడి నర్సారెడ్డి, హాజరై కాలనీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని తాను సంపూర్ణంగా సహకరిస్తానని తెలియజేయడం జరిగింది.

 

 

తరువాత జరిగిన ఎన్నికలలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవులకు పోటాపోటీగా జరిగిన ఎన్నికలలో

 

 కుంటాల గంగాధర్ అధ్యక్షులుగా 

 

కొల్లెపు సాయిలు ప్రధాన కార్యదర్శిగా 

 

అఖండ మెజారిటీతో గెలుపొందడం జరిగింది.

 

కాలనీ అభివృద్ధి కమిటీ 

ఆర్థిక కార్యదర్శిగా కటకం క్రాంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

 

ఉపాధ్యక్షులుగా కులకర్ణి సునీల్ రావు, పూరి రవీందర్, గజ్జి శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.

 

 నూతనంగా ఎన్నికైన తిరుమల కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుంటాల గంగాధర్, మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలుపొందించిన కాలనీవాసులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నివేళలా అందుబాటులో ఉంటానని, స్థానిక కౌన్సిలర్ సహకారంతో, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో కాలనీ అభివృద్ధికి పాటుపడతానని తెలియజేశారు.

ఈ ఎన్నికలలో 123 మంది కాలనీవాసులు పాల్గొని ఓట్లు వేయడం జరిగింది.

 

 ఎన్నికల అధికారులుగా బాగుల రవీన్, రేపర్తి శ్రీకాంత్, కారపు శంకర్, చౌల్ కిరణ్ వ్యవహరించడం జరిగింది.

Leave a Comment