గృహలక్ష్మి సర్వే నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది

నిజామాబాద్ A9 news

Picsart 23 08 12 22 54 03 917

ఆర్మూర్ మున్సిపల్ పరిధలోని పెర్కిట్ లో తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని, ఇళ్లు లేని పేదల సొంతింటి కల నెరవేరేందుకు దీనికోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.

గడిచిన మూడు రోజుల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఆర్మూర్ పట్టణంలోని 20వ వార్డులో గృహ లక్ష్మీ పథకానికి సంబంధించిన దరఖాస్తులను మున్సిపల్ సిబ్బంది ఎవరైతే గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకున్నారో వారి యొక్క దరఖాస్తులను ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ నరసయ్య, బిల్ కలెక్టర్లు చెన్న గంగా మోహన్, డి సువర్ణ, అక్షయ్ లు పాల్గొన్నారు.

Leave a Comment