కళాశాలలో చదివే మహిళలకు సౌకర్యాల కొరతలు – తక్షణమే తీర్చాలి

A9 న్యూస్ ప్రతినిధి:

IMG 20240720 WA0030

తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ధర్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో నీటి సౌకర్యం కొరత ఉన్నందున ఆ సమస్యని వెంటనే పరిష్కరించవలసిందిగా టి ఎన్ వి ఎస్ విద్యార్థి సేన జిల్లా కార్యదర్శి వెంకటేష్ నాయక్ మండల ఏ ఈ అధికారి కి ఫిర్యాదు చేయడం జరిగింది. నీటి కొరత వలన కళాశాలలో చదివే మహిళలకు తీవ్ర ఇబ్బందిలు అవుతున్నాయి దానివలన కొంత మంది మహిళలు స్థానికంగా ఇంటర్, డిగ్రీ కళాశాలలో చేయడానికి ఇష్టపడడం లేదు కావున తక్షణమే నీటి కొరతను తీర్చవలసిందిగా మండల ఏ ఈ అధికారి కి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దినేష్, వంశీ, అరవింద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

IMG 20240720 WA0029

Leave a Comment