ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పదోన్నతిపై సూపరింటెండెంట్

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: 

* ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పదోన్నతిపై సూపరింటెండెంట్

*చింతపండు రవికుమార్ ను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పదోన్నతిపై సూపరింటెండెంట్ గా చింతపండు రవికుమార్ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం వారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆత్మీయ మిత్రులు జింధం నరహరి, బండి రాజలింగం, గుమ్మడి అశోక్, సామల గంగా సాగర్ వన్నెల్(కే) మాజీ సర్పంచ్, తుకారాం, కట్కం ప్రకాష్ తదితరులు సూపరింటెండెంట్ కార్యాలయంలోని వారి ఛాంబర్ లో పుష్పగుచ్చాన్నిచ్చి శాలువతో సత్కరించి, స్వాగతం పలికారు. ఆత్మీయ మిత్రులు మాట్లాడుతూ నూతన సూపరింటెండెంట్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Comment