ఆర్మూర్ జెండా బాలాజీ ప్రతిష్టాపన

నిజామాబాద్ A9 news

Picsart 23 08 19 19 44 37 461 1

ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో సర్వసమాజ్ ప్రజా ఐక్య సమితి ఆధ్వర్యంలో జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

 

ఈ సందర్భంగా దత్తాత్రేయ ఆలయంలో ధ్వజస్తంభం శటగోపంకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, పట్టణంలో జెండాను ఊరేగించి, జెండా బాలాజీ ఆలయంలో ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.


సర్వ సమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజు మాట్లాడుతూ జెండా బాలాజీ ఆలయంలో జెండా నవరాత్రి ఉత్సవాలు గత కొద్ది సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందని, తిరుపతి వెళ్లలేని వారు జెండా జాతరలో జెండాకు మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. 9 రోజులపాటు ఉత్సవాలు ఘనంగా కొనసాగుతాయని, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ కార్యదర్శి దినేష్, కోశాధికారి శివ, సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave a Comment