అధిష్టానానికి ధన్యవాదములు :నూతన పి సీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

అధిష్టానానికి ధన్యవాదాలు..

టీపీసీసీ నూతన అధ్యక్షులు

మహేష్ కుమార్ గౌడ్. 

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి :

సెప్టెంబర్ 06

కాంగ్రెస్ పార్టీ నూతననంగా తెలంగాణ పి సీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ

నాపై అత్యంత నమ్మకం తో నాకు కీలకమైన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు..

ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతి పక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులకు, ఎంపీ లకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యే లకు, డీసీసీ అధ్యక్షులకు, పార్టీ కోసం అనునిత్యం పాటు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు ..

పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధి తో అంకిత భావంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తాను..

నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీ కి, ప్రభుత్వానికి అనుసంధానం గా పని చేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తాను..

ఇంతకాలం నాకు అన్ని రకాలుగా సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు..

 

నాకు పదవి రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు . మహేష్ కుమార్ గౌడ్..

Leave a Comment